దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా రౌద్రం రణం రుథిరం. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, అజయ్ దేవ్ గన్, ఒలియా మోరిస్ తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు నటిస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్.టి.ఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా రాం చరణ్ నటిస్తుండగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక షూటింగ్స్ కి పర్మిషన్ రావడంతో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని మొదలు పెడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఆ ప్రయత్నాలు ఫ్లాపవుతున్నాయి. 

 

ఇప్పటికే పూణె లో షెడ్యూల్ ప్లాన్ చేసి క్యాన్సిల్ చేశారు. అక్కడ కొంత బడ్జెట్ వేస్ట్ అయిందట. అలాగే సెట్స్ నిర్మాణంలోను కాస్త ఓవర్ బడ్జెట్ అవుతుందని నిర్మాత టెన్షన్ పడుతున్నారట. అయినా రాజమౌళి ధైర్యంగా ఆర్.ఆర్.ఆర్ ని తిరిగి షూటింగ్ మొదలు పెడదామంటే ఇందులో ఎక్కువమంది బాలీవుడ్ హాలీవుడ్ నటులుండటంతో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావడం కష్టమని తెలిసిందే. దానికి తోడు ఎన్.టి.ఆర్, చరణ్ లు కూడా ఇప్పట్లో షూటింగ్ కి హాజరవడానికి సిద్దంగా లేరని వార్తలు వస్తున్నాయి.

 

దాంతో ఆర్.ఆర్.ఆర్ విషయంలో చాలా మందికి చాలా రకాల అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా బిజినెస్ ఎలా అవుతుందో ...నిర్మాత కి లాభాలొస్తాయా..ఇలా చాలా అనుమానాలు మొదలయ్యాయి. కాని ఇవన్ని వింటూ సైలెంట్ గా ఉన్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో భారీ సక్సస్ కొట్టి అందరి అనుమాలకి ఒకే ఒక్క సమాధానం ఇవ్వాలని ముని లాగా మిన్నకున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: