బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య తో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించిన బోయపాటి మరోసారి బాలయ్య ని ఎంతో పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అండ్ పోస్టర్స్ తో అర్థమవుతోంది. రెండు విభిన్న మైన పాత్రల్లో నటిస్తున్న బాలయ్య రీసెంట్ గా ఒక పాత్రను రివీల్ చేశారు. 

 

బాలయ్య రేంజ్ అండ్ స్టామినా ఏంటో ఈ ఒక్క టీజర్ తో ఫ్యాన్స్ కే కాదు యాంటీ ఫ్యాన్స్ కి తెలిసింది. గతకొంతకాలంగా వరసగా ఫ్లాప్ వస్తుండటంతో బాలయ్య ఈ సారి గట్టి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ..ఈ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చి వరసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ దర్శకులకి మాత్రం కథ కొత్తగా ఉండాలని.. తనని కొత్తగా ప్రజెంట్ చేయాలని ఖచ్చితంగా చెబుతున్నారు.

 

ఇక బాలయ్య త్వరలో బిబి3 ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని బోయపాటికి సూచించాడట. వీలైంత త్వరగా సినిమాని పూర్తి చేద్దామని చెప్పినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి మోనార్క్ అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు. అంతేకాదు ఈ టైటిల్ కి ఫ్యాన్స్ నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దాంతో అదే టైటిల్ ని ఫైనల్ చేస్తారని అంటున్నారు. 

 

ఇక హీరోయిన్స్ గా శ్రియ శరణ్, అంజలి నటించబోతున్నారన్న వార్తలు రాగా ఇప్పుడు ప్రియమణి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే బాలయ్య తన సినిమా షూటింగ్ లో 50 మంది తప్ప ఒక్కరు కూడా ఎక్కువ ఉండకూడదని లాక్ డౌన్ కి ముందే చెప్పారట. కాని అది ఎలా సాధ్యం అవుతుంది అంటూ చాలా మంది కౌంటర్ వేశారు. కాని ఇప్పుడు బాలయ్య చెప్పినట్టే ప్రభుత్వం సినిమా షూటింగ్ జరుపుకోవాలంటే 50 మంది యూనిట్ సభ్యులు మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించింది. అంటే మొనార్క్ బాలయ్య చెప్పిందే జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: