విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ షాలిని పాండేసినిమా తర్వాత హీరో రేంజ్ లో పాపులారిటీ రాకపోయినా అమ్మడికి ఓ   మోస్తారుగా క్రేజ్ వచ్చింది. వరుస సినిమాలైతే చేస్తున్నా తన మార్క్ చూపించడంలో వెనుకపడుతున్న షాలిని పాండే బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం అక్కడ రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళంలో కూడా అమ్మడు సినిమాలు చేస్తుంది.

 

ఇక కరోనా మహమ్మారి వల్ల 3 నెలలు లాక్ డౌన్ లో షాలిని ఏం చేసింది అంటే.. తినడం, నిద్రపోవడం, ఇంటి పనులు చూసుకోవడం. ఇక మిగతా టైం అంతా సినిమాలు, సీరియల్స్ చూడటమే తన పని అయ్యిందని చెప్పుకొచ్చింది షాలిని పాండే. అంతేకాదు సీలింగ్ వైపు అదే పనిగా చూడటం.. తనలో తాను మాట్లాడుకోవడం కూడా జరిగిందట. ఈ లక డౌన్ టైం లో అందరు హీరోయిన్స్ సొంత వంటలతో సత్తా చాటారు. కొందరు వచ్చి చేస్తే.. కొందరు రాకపోయినా సరే నేర్చుకునేందుకు చేశారు. మరి షాలిని కుకింగ్ విషయాలేమి చెప్పలేదు కాని బోర్ కొట్టి తనలో తాను మాట్లాడుకున్నా అని చెప్పడం విశేషం. 

 

తెలుగులో అమ్మడు సినిమాలైతే చేస్తుంది కాని హీరోయిన్ గానే కాకుండా అంతగా గుర్తింపు లేని పాత్రలు చేయడం వల్ల కెరియర్ లో వెనుకపడ్డది. తనకు వచ్చిన క్రేజ్ ను సరైన సబ్జెక్టులు ఎంచుకుని సినిమాలు చేస్తే బెటర్ అని అంటున్నారు సిని విశ్లేషకులు. సరైన అవకాశం వస్తే టాలెంట్ చూపించేద్దాం అనుకుంటున్న అమ్మడికి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: