పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబంధించి తీసుకున్న ఒక లేటెస్ట్ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పవన్ తన కెరియర్ లో ఎప్పుడు లేనివిధంగా రెండు సినిమాలు మొదలుపెట్టిన ఆనందం కరోనా దెబ్బతో ఆవిరి అయిపోయింది.


ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ పెండింగ్ షూటింగ్ ఇంకా 30 రోజుల వరకు మిగిలి ఉంది. పవన్ కు కరోనా భయాలు తగ్గిన తరువాతా ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ సినిమాను పూర్తి చేయడానికి దిల్ రాజ్ రెడీగా ఉన్నాడు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే పవన్ తో క్రిష్ మొదలుపెట్టిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ విషయంలో పవన్ క్రిష్ కు ఈమధ్య తాను తీసుకున్న ఒక నిర్ణయాన్ని వివరించి అతడి మైండ్ బ్లాంక్ చేసినట్లు టాక్.


ఇక నుంచి తన సినిమాలలో హీరోయిన్స్ తో డాన్సులు చేసే పాటలు చేయనని అదేవిధంగా హీరోయిన్స్ తో ఇంటిమేట్ సీన్స్ లో కూడ నటించను అనీ స్పష్టంగా క్రిష్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పాటలు డాన్స్ లు రొమాన్స్ సీన్స్ లేకుండా సినిమాను పూర్తి చేయమని ఒకవేళ పాటలు ఉండవలసి వస్తే అవి కూడా సందర్భానుసారంగా ఉండాలి కానీ కేవలం కమర్షియల్ సినిమాల స్థాయిలో తన సినిమాలలో సీన్స్ ఉండ కూడదు అన్న పవన్ నిర్ణయం క్రిష్ కు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారం మేరకు క్రిష్ పవన్ ల ప్రాజెక్ట్ పై ఆమూవీ నిర్మాత ఏయం రత్నం 150 కోట్లు పైగా పెట్టుబడి పెట్టవలసి వస్తోంది. ఇలాంటి భారీ సినిమాను పవన్ లేటెస్ట్ నిర్ణయాలకు అనుగుణంగా తీస్తే బయ్యర్లు ఎంత వరకు కొంటారు అని క్రిష్ భయపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో ఇండస్ట్రీలోని కొందరు ఈవార్తల పై కామెంట్స్ చేస్తూ కరోనా పరిస్థితులు వల్ల ఎంతటి గొప్ప వారైనా భౌతిక దూరం పాటించవలసిన నేపద్యంలో కరోనా భయాలతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదంటే రాజకీయాలలో కొనసాగుతున్నాడు కాబట్టి సభ్యత కోసం పవన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: