కరోనా సమస్యలు మొదలైన దగ్గర నుండి మహేష్ తన కుటుంబ సభ్యులతో పరిమితం అయి బయటకు కూడ రావడం లేదు. ఆఖరికి గత నెల జరిగిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలలో కృష్ణ కూతుళ్ళు కనిపించారు కాని మహేష్ కనిపించక పోవడంతో మహేష్ ఏమయ్యాడు అంటూ కొందరు కామెంట్స్ కూడ చేసారు.


ఈ లాక్ డౌన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మహేష్ తన కొడుకు కూతురు తో తెగ ఎంజాయ్ చేస్తూ ఆ విషయాలకు సంబంధించిన ఫోటోలను తన పిఆర్ టీమ్ తో షోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుతం మహేష్ ఎవరికీ అందుబాటులో ఉండకుండా కనీసం కొందరు దర్శకులు కథలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నా మహేష్ వారికి టైమ్ కూడ ఇవ్వడం లేదని టాక్.


పరుశు రామ్ తో ఫిక్స్ అయిన ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ ను డిసెంబర్ వరకు వాయిదా వేసి పూర్తిగా మహేష్ ఇంటికే పరిమితం అయిపోయాడు. మహేష్ ఈ లాక్ డౌన్ పిరియడ్ అనుభవాలను తన డైరీలో వ్రాసుకుంటూ భవిష్యత్ లో తన పిల్లలకు పూర్తిగా అర్ధం అయ్యేలా లాక్ డౌన్ డైరీ వ్రాస్తున్నాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కథ మొత్తం పూర్తిగా బడా బాబుల బ్యాంక్ రుణాల ఎగవేత చుట్టూ తిరిగే నేపధ్యంలో ఈ సినిమా కోసం ఒక భారీ బ్యాంకు సెట్‌ను రెడీ చేస్తున్నారు అని తెలుస్తోంది.  హైదరాబాద్‌కు ఒక స్టూడియోలో ఈ బ్యాంక్ సెట్‌ను రెడీ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉందట. వాస్తవానికి ఈ సినిమా కథ రీత్యా కొన్ని సీన్స్ అమెరికాలో తీయవలసి ఉంది. అయితే ఇప్పట్లో అమెరికా వెళ్ళే అభిప్రాయం లేక అమెరికా వాతావరణాన్ని ప్రతిబింబించే ఒక భారీ సెట్ ను కూడ రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: