టాప్ హీరో రేసులో దూసుకు పోతూ చిరంజీవి వారసుడుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న రామ్ చరణ్ కు ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని షాక్ తగలడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసివేస్తోంది. ఒక మీడియా సంస్థ లేటెస్ట్ గా ఈ లాక్ డౌన్ సమయంలో నిర్వహించిన సర్వేలో 2020 సీజన్ లో చరణ్ 9వ స్థానంలో ఉన్నాడని తెలియచేయడం మెగా అభిమానులకుబాధను కలుగచేస్తోంది. అయితే దీనికితోడు ఈ సంవత్సరానికి సంబంధించి ప్రకతిమ్పబడ్డ ర్యాంకింగ్స్ లో అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలోకి చేరుకోవడం మెగా అభిమానులు తట్టుకోలేని విషయంగా మారింది. ప్రిన్స్ మహేష్ బాబుకు ఈ సర్వేలో 2వ స్థానం దక్కింది. 

 

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తరువాత ఈ సర్వే జరపడంతో ఇలాంటి ఫలితాలు వచ్చి ఉంటాయి అని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలోని తరువాత స్థానంలో ప్రభాస్ జూనియర్ నాని విజయ్ దేవరకొండ ల తరువాత స్థానంలో చరణ్ కు తొమ్మిదవ స్థానం లభించడం వెనుక ఒక కారణం ఉంది అని కొందరి భావన. 

 

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోయినా అతడి నుండి మరో హిట్ సినిమా రాలేదు.  2019 సంక్రాంతి విడుదలైన ‘వినయ విధేయ రామ’ ఫెయిల్ అవ్వడం కూడ చరణ్ స్థానాన్ని తగ్గించినట్లు అనిపిస్తోంది. దీనికితోడు నిర్వహించబడ్డ ఈ సర్వే ఆన్ లైన్ సర్వే అని చెపుతున్న పరిస్థితులలో ఎంతవరకు ఈ సర్వే వాస్తవం అన్న అభిప్రాయాలు కూడ మెగా అభిమానులలో ఉన్నాయి.

 

అయితే ‘సాహో’ లాంటి ఘోరమైన ఫ్లాప్ వచ్చినతరువాత కూడ ప్రభాస్ కు ఈ సర్వేలో మూడవ స్థానం లభించడం అతడి మ్యానియాను సూచిస్తోంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ రికార్డులను ఈ సంవత్సరం పవన్ కాని చిరంజీవి కాని బ్రేక్ చేస్తారు అని ఆశపడి వారి సినిమాలు వాయిదా పడటంతో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు ఈ సర్వేలో చరణ్ స్థానం తగ్గిపోవడం మరింత కలవర పెడుతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: