ప్రస్తుతం అంతా డిజిటల్ యుగమే నడుస్తోంది. సినిమా చిత్రీకరణ నుంచి సినిమా ప్రదర్శన వరకూ మొత్తం వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు మరో ముందడుగు వేసి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చేశాయి. వీటికున్న ఆదరణ దృష్టిలో పెట్టుకుని కూడా సినిమాలు తీస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ బిగ్గీ అల్లు అరవింద్ కూడా ‘ఆహా’ పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే పలు మూవీస్, వెబ్ సిరీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ‘ఆహా’కు మరింత బూస్టప్ ఇచ్చి ప్రేక్షకులకు చేరువ చేయాలని పెద్ద ప్లానే వేశారు.

IHG

 

టాలీవుడ్ హాట్ మిల్కీ బ్యూటీ తమన్నాతో ఆయన టాక్ షో ప్లాన్ చేశారని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. మెగా క్యాంప్ లోని హీరోలతో ఈ టాక్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది. రామ్ చరణ్, బన్నీ, సాయి తేజ్, వరుణ్ తేజ్.. ఇలా స్టార్ హీరోలతో తమన్నాతో టాక్ షో చేసి ‘ఆహా’లో ప్రసారం చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట. మెగా హీరోలను ఎలాగూ ఒప్పించాల్సిన పని లేదు. ఈ టాక్ షో గురించి ఇప్పటికే తమన్నా సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం కూడా జరిగిందంటున్నారు. దీంతో ‘ఆహా’కు మరింత క్రేజ్ తీసుకురావాలన్నది అరవింద్ ప్లాన్.

IHG

 

కేవలం మెగా హీరోలతోనే కాకుండా హీరో, హీరోయిన్లు అందరితో ఈ టాక్ షోను రన్ చేయాలనేది అరవింద్ ప్లాన్ అంటున్నారు. అయితే.. మొదటగా మెగా హీరోలతో రన్ చేసి ఆడియన్స్ లోకి వెళ్లాలనేది ప్లాన్. ఇందుకోసం తమన్నాకు పెద్ద మొత్తమే ఆఫర్ చేశారంటున్నారు. ఈ షో క్లిక్ అయితే జానాల్లోకి ‘ఆహా’ ఇంకా బాగా వెళ్తుందని పరిశీలకులు అంటున్నారు. మరి.. ఈ వార్తలన్నింటిపై అఫిషియల్ న్యూస్ అరవింద్ నుంచి రావాల్సిందే

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: