స్టార్ హీరోలతో కాప్ స్టోరీలు తీసి సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నాడు తమిళ డైరెక్టర్ హరి. అందులో భాగంగా చియాన్ విక్రమ్ తో సామి సిరీస్ (సామి , సామి స్కొయెర్)అలాగే సూర్య తో సింగం సిరీస్ ( సింగం , సింగం 2,సింగం 3) ఇలా మొత్తం 5సినిమాలు తీశాడు హరి. వీటిలో సామి ,సింగం 1, సింగం 2 బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి. అయి  ఈ సినిమాలు తీసినందుకు ఇప్పుడు చింతిస్తున్నాని హరి సెన్సేషనల్  స్టెంట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ హరి ఇలా అనడానికి కారణం ఏటంటే  .. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో  తండ్రి, కొడుకులు లాకప్ డెత్  అయ్యారు ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాన్ని ఊపేస్తోంది. వీరిద్దరని స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు దారుణంగా హింసించడం తో కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన జయరాజ్ మరియు ఫినిక్స్ కుటుంబానికి న్యాయం జరగాలని దోషులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రెటీలు గొంతు కలుపుతున్నారు. 
 
అందులో భాగంగా హరి స్పందిస్తూ.. ఇలాంటి  దారుణమైన ఘటన ఇంకోసారి తమిళనాడులో జరుగకూడదు దోషులకు కఠినంగా శిక్షపడాలి కొంత మంది పోలీసులు తప్పులు చేయడం వల్ల మొత్తం  పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది. పోలీసులను హీరోగా చూపిస్తూ నేను 5 సినిమాలు చేసినందుకు చింతిస్తున్నాని హరి ఓ లేఖను విడుదలచేశాడు.
ఇక ఇదిలావుంటే ఈకేసును సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: