కొంత మంది హీరోయిన్లు తక్కువ చిత్రాల్లో నటించినా మంచి గుర్తింపు వస్తుంది.  అలాంటి హీరోయిన్లలో ఒకరు రాధికా ఆప్టే.  రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర చిత్రంలో నటించింది. ఆ తర్వాత  బాలయ్య సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది.  ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కబాలి చిత్రంలో నటించింది.  ఇలా తక్కువ చిత్రంలో నటించినా మంచి పేరు తెచ్చుకుంది.  ఇక బాలీవుడ్ లో ఈ అమ్మడు ఎన్నో బోల్డ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.  అంతే కాదు మీడియా ముందు కూడా బోల్డ్ గానే మాట్లాడుతుంది. 

 

అప్పట్లో తెలుగు హీరోలపై కూడా సంచలన కామెంట్స్ చేసింది.  సాక్రెడ్‌ గేమ్స్‌, ఘౌల్‌, అహల్య ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా, ప్రజలు వెబ్‌ షోలు చూస్తున్నారు. ఇపుడు నా కోసం లండన్‌ వీధుల్లో ప్రజలు ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురుచూస్తున్నారు.  తాజాగా రాధికా ఆప్టే లండన్ లో తన అనుభవాల గురించి తెగ సంబరపడిపోతూ మాట్లాడింది. 

 

లండన్‌ లో అద్భుతమైన అనుభవాన్ని ఎప్పుడూ పొందలేదు అని రాధికా ఆప్టే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. కొంతమంది అభిమానులు నా దగ్గరికి వచ్చి..స్నేహంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. కొందరూ నా దగ్గరకు వచ్చి మీ యాక్టింగ్‌ చాలా బాగుంటుందని చెబుతున్నారని చెప్పుకొచ్చింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని రాధికా ఆప్టే చెబుతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: