స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ పుష్ప షూటింగ్ ఆగస్టు లో ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయని సమాచారం. జూన్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది కానీ కరోనా వల్ల వాయిదాపడింది. ఇక ఈచిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కనుండడంతో చాలా వరకు షూటింగ్ అడవుల్లోనే చేయాల్సి ఉంటుంది అందుకోసం మేకర్స్ లొకేషన్స్ కూడా వెతికారు. అందులో భాగంగా నల్గొండ  ఫారెస్ట్ లో స్మగ్లింగ్ కు సంబందించిన సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. ఈచిత్రంలో బన్ని లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
 
స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న పుష్పలో బన్ని సరసన రష్మిక కథానాయికగా నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ తో బన్నికిఎం ఇది మూడో సినిమా. ఈ సినిమాలో బన్ని ,రష్మిక ఇద్దరు చిత్తూరు స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో  విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ,ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ లో నటించనున్నాడు. దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నాడు.
 
ఇదిలావుంటే నాపేరు సూర్యతో పరాజయాన్ని చవిచూసిన అల్లు అర్జున్ ఇటీవల అల.. వైకుంఠపురములోతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. భారీ పోటీ నడుమ సంక్రాంతి కి విడుదలైన ఈ చిత్రం150కోట్ల వసూళ్లను రాబట్టి బాహుబలి సిరీస్ తరువాత టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమా గా రికార్డు సృష్టించింది. త్రివిక్రమ్ ఈసినిమాకు దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: