కొన్ని కాంబినేషన్లలలో సినిమాలు ప్రేక్షకుల్లోనూ, బిజినెస్ సర్కిల్స్ లోనూ సంచలనం రేపుతాయి. అటువంటి సంచలనమే రేపింది తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్ నాగార్జున హీరోగా సినిమా అనే వార్త. ‘నాన్ రుద్రన్’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ సినిమా అప్పట్లో అనౌన్స్ చేశారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమా అనుకోని కారణాలతో ఆగిపోయింది. అయితే.. ఇప్పుడీ సినిమాపై ఓ ఆసక్తికర వార్త చెన్నై ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ధనుష్ స్వయంగా కధ రాసి దర్శకత్వం వహించాల్సిన సినిమా ఇది.

IHG

 

అయితే కథానుసారం సినిమా 600ఏళ్లు వెనక్కు వెళ్లి తెరకెక్కించాల్సి ఉందట. అయితే.. ఈ కథను అంత వెనక్కు వెళ్లి తీయడంలో తనకంటే తన అన్న సెల్వ రాఘవన్ సిద్ధహస్తుడని సంప్రదించాడట. దీంతో సినిమాలో ఆ వెర్షన్ ను అన్న డైరక్ట్ చేయడానికి ఒప్పించాడని సమాచారం. ‘యుగానికొక్కడు’ సినిమాతో ఈ తరహా జోనర్ తెరకెక్కించి ఆశ్చర్యపరిచాడు. దీంతోనే ఈ ప్రాజెక్ట్ అన్నకు అప్పజెప్పాడని టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఈ సినిమాకు స్వయంగా ధనుష్ దర్శకత్వంలో ప్రారంభమవుతుందని మరో వార్త హల్ చల్ చేస్తోంది.

IHG

 

ధనుష్ స్వీయ దర్శకత్వంలో ‘పవర్ పాండీ’ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్లీ తన దర్శకత్వం పదును చూపించాలని చూస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాను తెరకెక్కించే నిర్మాణ సంస్థ తప్పుకోవడంతో ఈ సినిమా అప్పట్లో ఆగిపోయింది. ఇప్పుడు కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం గాసిప్స్ గా రౌండ్ అవుతున్న ఈ వార్తలన్నింటి పై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే. ఈ వార్తల్లో నిజమెంతుంతో కూడా తెలియాల్సిందే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: