థియేటర్లు బంద్ అయినా.. బుల్లితెర మొత్తం ఆగిపోయినా ఎప్పుడు తీశాడో.. ఎలా తీశాడో  తెలియదు కానీ ఆర్జీవి చేస్తున్న హడావిడి మాములుగా లేదు. మొన్ననే మియా మాల్కోవాతో క్లైమాక్స్ సినిమా తీసి ఆర్జీవి వరల్డ్ ఏటిటి రిలీజ్ చేసిన వర్మ ఆ కళాకండంతో బాగానే జేబులో వేసుకున్నాడని తెలుస్తుంది. క్లైమాక్స్ సినిమాను 100 పర్ వ్యూగా రిలీజ్ చేసిన ఆర్జీవి లేటెస్ట్ గా నేక్డ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బెంగళూరు భామ స్వీటీతో ఆర్జీవి చేసిన ఈ సినిమా బీ గ్రేడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదన్నట్టు ఉంది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా శనివారం రాత్రి రిలీజ్ చేశారు. ఈ సినిమా చూడాలంటే మాత్రం 200 పర్ వ్యూ పెట్టాడు వర్మ. ఫారిన్ అందాల కన్నా లోకల్ అందాలకు డిమాండ్ ఎక్కువ అనుకునేలా వర్మ చేసిన ఈ నేక్డ్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను కూడా ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. శనివారం 9 గంటలకు రిలీజ్ చేసిన ఈసినిమాను మొదటి అర్ధ గంటలోనే 23, 560 మంది చూసినట్టు తెలుస్తుంది. అంటే అప్పటికే 47 లక్షలు వచ్చాయన్నమాట. అయితే ఈ సినిమాకు వర్మ కేవలం 5 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు టాక్. 5 లక్షల సినిమా మొదటి గతంలోనే 50 లక్షలు తీసుకొచ్చింది.

అంటే ఎలా లేదన్నా వర్మ ఈ నేకెడ్ మూవీ ద్వారా కోటి లాభపడ్డట్టే అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆర్జీవి పవర్ స్టార్ టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో పవన్ డూప్ గా చేసిన అతన్ని లీడ్ రోల్ లో పెడతాడని తెలుస్తుంది. లాక్ డౌన్ లో సినిమాలు రిలీజ్ అవక ఓ పక్క స్టార్ హీరోలు, డైరక్టర్ లు డీలా పడుతుంటే వర్మ మాత్రం వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అయితే అవి ఆయన రేంజ్ సినిమాలు కాకపోయినా సరే ఆడియెన్స్ మాత్రం వర్మ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: