'గుండెజారి గల్లంతయ్యిందే' ' ఒకలైలా కోసం ' వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా కొండా విజయ్ కుమార్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ తీసిన రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో యంగ్ హీరోలకి బెస్ట్ డైరెక్టర్ గా మారాడు. అయితే ఆ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్నాడు. నితిన్ తో ఆ సినిమా కూడా ప్లాన్ చేసుకున్నాడు. కాని ఈ దర్శకుడికి వ్యక్తిగత సమస్యలు రావడం ఆ తర్వాత లాంగ్ గ్యాప్ రావడం జరిగింది.

 

దాంతో చాలాకాలం కనపడకుండా పోయారు. మళ్ళీ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తో 'ఒరేయ్ బుజ్జిగా' అనే సినిమాని తెరకెక్కించి కం బ్యాక్ అయ్యాడు. ఈ సినిమాలో మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించగా.. 'శ్రీ సత్య సాయి ఆర్ట్స్' బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించాడు. వాస్తవంగా ఈ సినిమా మార్చి 25న విడుదల చెయ్యాలని చిత్ర బృందం సన్నాహాలు చేశారు. కాని కరోనా దెబ్బతో అది సాధ్య పడలేదు. 

 

అయితే చిన్న సినిమా కాబట్టి మంచి ఆఫర్ రావడం తో ఓటిటిలో విడుదల చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వీషయంలో మేకర్స్ స్పందించారు. తన సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచన ఎంతమాత్రం లేదని ఇదంతా గాలి వార్త అంటూ తేల్చిపారేశారు. ఇదిలా ఉంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు కొండా విజయ్ కుమార్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ తన సత్తా చూపించాలనుకున్నాడు. కాని కరోనా తో కొండా విజయ్ కుమార్ ప్లాన్ అన్ని తారుమారు అయ్యాయి. చెప్పాలంటే తను పెట్టుకున్న ఆశలన్ని ఆవిరైయ్యాయని చెప్పాలి. మరి చిత్ర బృందం ఓటీటీ కి అమ్మకుండా ధీమాగా ఉన్నారంటే ఖచ్చితంగా సినిమా హిట్ అనే అనుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: