విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండకి స్టార్ స్టేటస్ వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు.

 

అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించగా, హీరోయిన్ కియారా అద్వానీ కనిపించింది. విమర్శలతో పాటు విపరీతమైన వసూళ్ళు ఆర్జించిన ఈ చిత్రం షాహిద్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ తర్వాతి చిత్రం ఎక్కడ ఉంటుందనే విషయమై పెద్ద చర్చే నడుస్తుంది.

 

కబీర్ సింగ్ తో హిందీలో మంచి పేరు తెచ్చుకోవడంతో తన తర్వాతి చిత్రం బాలీవుడ్లోనే ఉంటుందని ప్రచారం జరిగింది. రణ్ బీర్ కపూర్ హీరోగా డెవిల్ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుందని అన్నారు. అయితే ఏమైందో ఏమోగానీ ఆ సినిమా గురించి మళ్లీ ఎలాంటి వార్తలు రాలేదు.  దాంతో సందీప్, ప్రభాస్ కి కథ వినిపించాడని, మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని అన్నారు. 

 

అయితే తాజాగా మళ్లీ సందీప్ తర్వాతి చిత్రం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పుడు చర్చల దశలో మిగిలిపోయిన డెవిల్ చిత్రమే మళ్ళీ ఓకే అయిపోయినట్లు,  సందీప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రణ్ బీర్ కపూర్ ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఈ సారైనా క్లారిటీ వస్తుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: