నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సున్నితమైన అంశాన్ని అందంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత వేణు కి రానా దగ్గుబాటిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రానా హీరోగా విరాట పర్వం అనే టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తుంది.

IHG

 

తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి జానపద గాయనిగా కనిపించనుంది. ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్లు చిత్రంపై ఆసక్తిని పెంచడమే కాదు అంచనాలని కూడా పెంచేసాయి. విరాట పర్వం నుండి విడుదల అయిన ప్రతీ పోస్టర్ లో సినిమా థీమ్ ఖచ్చితంగా కనిపించింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పోస్టర్ కి ఈ రేంజ్ లో స్పందన రావడం విరాటపర్వం విషయంలోనే జరిగిందేమో.

IHG

 

అయితే అన్నీ సవ్యంగా జరిగితే ఈ సినిమా ఇప్పటి వరకూ థియేటర్లలో రిలీజై ఉండేది. కానీ కరోనా వచ్చి అన్ని ప్లాన్లని మార్చి వేసింది. దాదాపు 90శాతం చిత్రీకరణ పూరి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులని స్టార్ట్ చేసిందట. రీ రికార్డింగ్ పనులని తమ ఆఫీసులోనే స్టార్ట్ చేయనున్నారని అంటున్నారు. ఆఫీసులోనే మ్యూజిక్ స్టూడియోని ఏర్పాటు చేసారట. రీ రికార్డింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా ఆఫీసులో కంప్లీట్ చేస్తారట.

 

డబ్బింగ్ ఇంకా ఇతర పనులని తర్వాత చేసుకోవాలని భావిస్తున్నారట. ప్రియమణితో పాటు నందితాదాస్, ఈశ్వరి రావు, జరీ వాహిబ్ కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: