బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత ఇండస్ట్రీలోని నెపోటిజంపై భారీ ఎత్తున విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా విమర్శలు చేస్తున్నారు.
స్టార్ వారసులగా ఎంట్రీ ఇచ్చిన తారలను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. దీంతో చాలా మంది సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నారు. సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీమ్, నేహా కక్కర్ లాంటి వారు విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా నుంచి వైదొలిగారు. సుశాంత్ మరణించిన 14 రోజుల తరువాత సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియా వేదికగా అభిమానులు రియా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ విమర్శలు, ప్రశ్నల నేపథ్యంలో రియా భారీ నిర్ణయం తీసుకుంది. భారీగా విమర్శలు వస్తుండటంతో తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో కామెంట్స్ సెక్షన్ను డిసేబుల్ చేసింది రియా.