రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం షూటింగ్  ఆగస్టు నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈసినిమా కోసం హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో మూడు భారీ సెట్ లను నిర్మిస్తున్నట్లు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించాడు. వాటిలో ఒకటి హాస్పిటల్ సెట్ కాగా   మిగితావి ఇటలీ స్ట్రీట్ సెట్ మరియు షిప్ సెట్.
 
1970 బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇదిలాఉంటే ఫస్ట్ లుక్ విడుదల విషయంలో మేకర్స్ సైలెంట్ అయిపోయారు. జూన్ మూడో వారంలో ఫస్ట్ లుక్ విడుదలకానుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాలేదు అయితే ఫస్ట్ లుక్ రెడీ గానే  వుంది కానీ విడుదలకు సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని కుదిరితే ఆగస్టు లో సినిమా షూటింగ్ ప్రారంభయ్యే రోజునే  ఫస్ట్ లుక్ ను విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈసినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్  చేస్తుండగా యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తుంది.
 
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించనున్నాడని తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కనున్న ఈచిత్రాన్ని సుమారు 4000కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్  బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించనున్నడు. ఈఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా 2022 లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: