స్టార్ హీరోల క్రేజ్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ఏం చేసినా అదో సంచలనమే. ఇక స్టార్స్ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ వారు పెట్టే మెసేజులు, ఫోటోలు వీడియోల కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు.  అయితే స్టార్ క్రేజ్ ను వాడుకునేందుకు వాణిజ్య సంస్థలు రెడీ అయ్యాయి. ఇదివరకు స్టార్స్ ప్రకటలను చేసి వారి ప్రొదక్ట్ ప్రమోట్ చేయడమో.. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమో జరుగుతుంది. అయితే ఈ లాక్ డౌన్ టైం లో స్టార్స్ తమ ప్రొడక్ట్స్ ను ఇన్ స్టాగ్రాం ద్వారా ప్రమోట్ చేస్తున్నారు.

 

సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో మహేష్ బాబు అత్యధికంగా 7 మిలియన్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ నమ్రతలు కలిపి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇక సమంతకు కోటి దాకా ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇలా అందరు 2 నుండి 4 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు. వీరిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహేష్, సమంతలతో ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు వాణిజ్య సంస్థలు. 

 

లేటెస్ట్ గా మహేష్, సమంతల ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ లో అప్డేట్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. సినిమాలో కూడా షాట్ మీద కనిపించని మహేష్ వాషింగ్ మిషన్ దగ్గర ఏరియల్ సర్ఫ్ కోసం నమతతో దిగిన పిక్ షేర్ చేశారు. ఇక మరోపక్క సమంత, చైతుల కపుల్ కూడా సేం స్టిల్ ఇచ్చి అలరించారు. ఇదంతా ఆ ప్రొడక్ట్ కు వారు చేస్తున్న ప్రమోషన్ అని తెలుస్తుంది. అయితే దీనికి గాను మహేష్, సమంతలకు భరీ రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. మాములుగా యాడ్స్ కోసం తీసుకునేంత కాకపోయినా ఇంట్లో ఉండి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి భారీగానే వారి రెమ్యునరేషన్ ఉంటుందని టాక్. మొత్తానిక్ అటు సినిమాలతో ఇటు ప్రకటనలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా మహేష్, సమంతలు రెండు చేతులా సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: