సరిలేరు నీకెవ్వరు తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు,గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో సినిమా చేయనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి ప్రధానంగా సాగే కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే టైటిల్ తో పాటు ప్రీ లుక్ పోస్టర్ విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ నేతృత్వంలో ప్రముఖ స్టూడియో లో బ్యాంకు సెట్ ను నిర్మిస్తున్నారు.  ఈసెట్ కోసం 5కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట  నిర్మాతలు. 
 
మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ఈసెట్ లో జరుగనుందట. నాలుగు ఫ్లోర్ల తో నిర్మిస్తున్న ఈబ్యాంకు సెట్ లో కేవలం ఒకటే బ్యాంకు కాకుండా పలు బ్యాంకులు వుండనున్నాయి. అందులో విదేశీ బ్యాంకు కూడా ఒకటి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో షూటింగ్ మొదలు కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటించనుండగా యువ హీరోయిన్ నివేత థామస్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని టాక్.
 
థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్  ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈచిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ ,రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత  కేఎల్ నారాయణ ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: