తన సినిమాలతో కన్నా ఎక్కువగా సోషల్ మీడియా పోస్ట్‌లతోనే వార్తల్లో నిలిచే నటుడు మంచు మనోజ్‌. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో సినిమాలకు దూరమైన మంచు మనోజ్‌ రీ ఎంట్రీకి భారీ ప్లాన్‌ చేసుకున్నాడు. అహం బ్రహ్మాస్మి పేరుతో భారీ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు. అయితే ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లో ఓ సాంగ్‌ను స్వయంగా రాసి పాడి రిలీజ్ చేశాడు మనోజ్‌.

 

ఇటీవల మనోజ్‌ భార్యతో విడాకులు తీసుకోవటం కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇలా వరుసగా ఏదో ఒక హడావిడితో వార్తల్లో ఉండే మనోజ్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ను షేర్ చేశాడు. సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు రెండు కుక్కలతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసిన మనోజ్‌ సాయి తేజ్‌ నా వియ్యంకుడు అంటూ కామెంట్ చేశాడు. `ఇది టాంగో, జోయాలకు డేట్‌ డే విత్ సోషల్ డిస్టాన్సింగ్‌.

 

నాకు ఇంత మంచి అల్లుడ్ని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్‌తేజ్‌కు కృతజ్ఞతలు. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభాకాంక్షలు వేయిస్తాం` అంటూ కామెంట్ చేశాడు. అయితే మనోజ్ చెప్పింది ఆ రెండు కుక్కలకు సంబంధించిన క్రాసింగ్‌ గురించే అని అర్ధమవుతోంది. అయితే అదే విషయాన్ని తనదైన స్టైల్‌లో ఫన్నీగా చెప్పాడు మనోజ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: