మిల్కీ బ్యూటీ తమన్నా 10, 12 ఏళ్ల క్రితం కెరియర్ ఆరంభించినా సరే ఇప్పటికి ఫాం ఏమాత్రం తగ్గలేదు. లాస్ట్ ఇయర్ ఎఫ్-2 హిట్ తో కెరియర్ లో జోష్ పెంచుకున్న తమన్నా ప్రస్తుతం గోపిచంద్ హీరోగా వస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా కొత్తగా ఆహా యాప్ కోసం స్పెషల్ హోస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. ఓటిటిలో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి, మిగతా వాటి పోటీని తట్టుకోడానికి కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో భాగంగా తమన్నాతో టాక్ షో ప్లాన్ చేస్తున్నారు.

 

అల్లు అరవింద్ ప్లాన్ ప్రకారమే ఈ టాక్ షో ఆలోచన చేశారట. తమన్నాతో మెగా హీరోలు, మిగతా స్టార్స్ స్పెషల్ చిట్ చాట్ ఉంటుందట. అయితే ఈ షో కోసం తమన్నా ఎపిసోడ్ కు 7 లక్షల దాకా తీసుకుంటుందని తెలుస్తుంది. దశాబ్ధ కాలంలో ఇప్పటికి తమన్నా అదే ఫాం కొనసాగిస్తుంది. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. తమన్నా చేస్తున్న ఈ షో క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. 

 

రాం చరణ్, అల్లు అర్జున్ లతో పాటుగా సాయి తేజ్, వరుణ్ తేజ్ లతో మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. ఇక ఆ తర్వాత టాలీవుడ్ బిగ్ స్టార్స్ ను ఈ షోలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట. తారల సీక్రెట్ విషయాలను రాబట్టే ఈ టాక్ షో బాలీవుడ్ షోలకు ధీటుగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదివరకు డేటింగ్, లవ్ స్టోరీ లాంటివి స్టార్స్ ను అడగాలంటే ఆలోచించే వారు.. కాని తమన్నా షో నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని టాక్. మరి ఈ షో ఎలా ఉంటుందన్నది ప్రోమో వస్తేనే కాని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: