అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో.. బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. హిందీలో హీరోగా నటించేందుకు పలువురు బాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి అల వైకుంఠపురములో రీమేక్ లో నటించే హీరో ఎవరు అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.  

 

అల వైకుంఠపురములో చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా.. మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పాటలు భాషాభేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా నిర్మాత అశ్విన్ వర్దె హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రీమేక్ లో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆరాటపడుతున్నారు.   

 

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ లాంటి స్టార్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు నేనే సూట్ అవుతాను అని యువ హీరో కార్తీక్ ఆర్యన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో అసలు ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రణవీర్ సింగ్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 

 

రణవీర్ సింగ్ నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో అయినా నిజముందా.. లేక రూమర్ గానే మిగిలిపోతుందా అనేది.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా అల వైకుంఠపురములో హిందీ రీమేక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలా సందడి చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో అల వైకుంఠపురములో ఏవిధంగా సక్సెస్ సాధించిందో అలాంటి హిట్ నే బాలీవుడ్ లో సొంతం చేసుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: