బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, రానాల మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. బాహుబలిలో ఒకరు హీరో, మరొకరు విలన్ అయినా కూడా ఇద్దరికి సమానమైన క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ఇద్దరు కలిసి మరో సినిమా చేసేంతగా ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ వచ్చింది. ఇదిలాఉంటే ఆఫ్టర్ బాహుబలి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఓ డియర్, రాధే శ్యాం టైటిల్స్ పరిశీలణలో ఉన్న ఈ సినిమాలో రానా కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.

 

కేవలం ప్రభాస్ కోసం మాత్రమే రానా ఈ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ రానా చేస్తున్న పాత్ర ఏంటి.. సినిమాలో రానా ఎలాంటి సర్ ప్రైజ్ చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్, రానా కలిసి చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక రానా విషయానికి వస్తే విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా రానా రెండు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. 

 

ప్రభాస్, రానా మరోసారి వెండితెర మీద తమ మ్యాజిక్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే సినిమా అనుకున్నప్పుడు ఈ పాత్ర ఉందో లేదో కాని రానా కోసం స్పెషల్ గా డైరక్టర్ ఈ రోల్ ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. ఇక సాహోతో మిస్సైన టార్గెట్ ను ప్రభాస్ ఈ సినిమాతో రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. పూజా హెగ్దెతో రొమాన్స్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే హాస్పిటల్ సెట్, ఓ పెద్ద షిప్ సెత్ వేస్తున్నట్టు తెలుస్తుంది.                

మరింత సమాచారం తెలుసుకోండి: