నయనతార పక్కా ప్రొఫెషనల్ గా మారుతోంది. సినిమాలు సినిమాలే బ్రేకప్ లు బ్రేకప్ లే అనేలా ముందుకెళ్తోంది. పాత జ్ఞాపకాలన్నింటినీ పక్కనపెట్టి.. న్యూ జర్నీ చేస్తోంది. మాజీ లవర్ తో కలిసి మళ్లీ సినిమా చేయబోతోంది నయనతార. 

 

నయనతార, ప్రభుదేవాను చాలా సీరియస్ గా లవ్ చేసింది. మిసెస్ ప్రభుదేవాగా మారడానికి సినిమాలు కూడా వదిలేయాలనుకుంది. కానీ ఏమయిందో తెలియదు కానీ.. వీళ్లిద్దరు విడిపోయారు. ఇక ఈ బ్రేకప్ తర్వాత నయన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే బ్రేకప్ తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోన్ను వీళ్లిద్దరూ ఇప్పుడు ఓ సినిమా చేయబోతున్నారనే టాక్ వస్తోంది. 

 

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో వరుస సినిమాలు తీస్తోన్న ప్రభుదేవా.. తర్వాత ఓ తమిళ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. కార్తీ, విశాల్ తో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు ప్రభుదేవా. అయితే విశాల్ తప్పుకోవడంతో ఈ మేల్ క్యారెక్టర్ ను ఫీమేల్ క్యారెక్టర్ గా మార్చేసి నయనతారని తీసుకోవాలనుకుంటున్నాడట ప్రభుదేవా. 

 

హీరోతో ఈక్వల్ రోల్ కాబట్టి నయనతార అయితే బాగుంటుందని లెక్కలేస్తున్నాడట ప్రభుదేవా. అందుకే ఈమెను కాంటాక్ట్ చేస్తున్నాడట. ఇక శింబుతో బ్రేకప్ తర్వాత కూడా కలిసి నటించింది నయనతార. ఇదునమ్మ ఆలు అనే మూవీ చేసింది. పర్సనల్ లైఫ్ ను కెరీర్ తో మిక్స్ చేయకుండా పక్కా ప్రొఫెషనల్ లా బిహేవ్ చేస్తోంది నయనతార. 

 

మొత్తానికి నయనతార పక్కా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తోంది. సినిమాలకు బ్రేకప్ లకు సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ముందుకు సాగుతోంది. మాజీ లవర్ తో మళ్లీ కలిసి సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. దేనికి అదే అంటూ నయన కొత్త భాష్యం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: