అక్కినేని నట వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీ నిర్మిస్తున్నారు. సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. బొమ్మరిల్లు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భాస్కర్ ఈ సినిమాతో తన ప్రతిభ చాటుటాడని అంటున్నారు. 

 

మాములుగా ఉంటే ఈ సమ్మర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ఎడిటింగ్ టేబుల్ మీదనే ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత్ అఖిల్ తమిళ దర్శకుడు మిత్రన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అభిమన్యుడు సినిమాతో సత్తా చాటిన డైరక్టర్ మిత్రన్ అఖిల్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందట. అయితే అదే అఖిల్ ను ఆలోచనలో పడేసిందని తెలుస్తుంది. కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు కాని మిత్రన్ కథ బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుట్ అవుతుందో లేదో అన్న ఆలోచనలో ఉన్నాడట అఖిల్.

 

తన ప్రతి సినిమా విషయంలో అఖిల్ ఈ డైలమా కంపల్సరీ అన్నట్టుగా కనిపిస్తుంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను మూడు సినిమాలు చేసిన అఖిల్ ఇప్పటివరకు కమర్షియల్ హిట్ కొట్టలేదు. మరి భాస్కర్ డైరక్షన్ లో సినిమాతో అయినా ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి. మిత్రన్ సినిమా చేసే ఆలోచన లేకపోతే తెలుగు దర్శకులతోనే సినిమా చేస్తాడు.                      

 

మరింత సమాచారం తెలుసుకోండి: