బిగ్ బాస్ కంటెస్టంట్స్ అంతా కలిసి మరొసారి రచ్చ చేశారు. ఎప్పుడు ఒకే సీజన్ లో కంటెస్టంట్స్ కలిసి హంగామా చేయడం చూస్తుంటాం కాని ఈసారి బిగ్ బాస్ 2,3 కి సంబందించిన కంటెస్టంట్స్ ఒకచోట కలిశారు. అందులో దీపితి సునైనా, హిమజ, శివ జ్యోతి ఉన్నారు. విరుగుతుంది కాని సౌండ్ రాదు అదేంటి అని హిమజ అడగ్గా.. దీప్తి సునైనా అదేదో అర్ధం కాలేదు అన్నట్టుగా ఫేస్ పెడుతుంది. ఇక ఇంతలోనే శివ జ్యోతి కల్పించుకుని చపాతి అంటుంది.

 

అది కాదు పాలు అంటూ సమాధానం ఇస్తుంది హిమజ. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారితో పాటుగా రవికృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. అయితే కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అసలు వీరు ముగ్గురు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు అంటే శివ జ్యోతి వాళ్ల ఇంట్లో అని తెలుస్తుంది. అప్పటివరకు ఫేస్ బుక్ వరకే పరిచయం ఉన్న దీప్తి సునైనా బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక మాత్రం బాగా పాపులర్ అయ్యింది. అయితే హీరోయిన్ గా అవకాశాలు రావట్లేదో చేసే ఉద్దేశం లేదో కాని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ అంటూ ఇంకా యూట్యూబ్ లోనే ఉంటుంది.

 

అమ్మడికి వచ్చిన క్రేజ్ కు కచ్చితంగా సినిమా ఆఫర్లు వచ్చే ఉంటాయి కాని దీప్తి సునైనానే చేయనని చెప్పి ఉండొచ్చని అంటున్నారు. బిగ్ బాస్ తర్వాత కూడా కంటెస్టంట్స్ తమ రిలేషన్ ను కొనసాగించడం చెప్పుకోదగ్గ విషయమే. బిగ్ బాస్ 1లో శివ బాలాజి, సెకండ్ సీజన్ లో కౌశల్, మూడవ సీజన్ లో రాహుల్ విన్నర్స్ గా నిలిచారు.       

       

మరింత సమాచారం తెలుసుకోండి: