ఇప్పుడు సినిమాలను విడుదల చేయడం అనేది నిజం గా ఒక సవాల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమాను పూర్తి చేసి దానిని విడుదల చెయ్యాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసే పరిస్థితి దేశ వ్యాప్తంగా నెలకొంది. హాల్ లో సినిమా విడుదల చేసే అవకాశం అయితే  లేదు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాను విడుదల చేస్తే ఓటీటీ లో మాత్రమే విడుదల చెయ్యాలి గాని హాల్ లో విడుదల చేసే అవకాశాలు లేవు అనే సంగతి అందరికి తెలిసిందే. 

 

ఇక ఆ విధంగా ఉన్నా సరే కీర్తి సురేష్ మాత్రం సినిమాల విడుదల  విషయంలో ఏ మాత్రం కూడా భయపడే అవకాశం లేదు అంటుంది. అవును ఆమె సినిమాల విడుదల విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. ఆమె నటించిన ఒక సినిమాను ఓటీటీ లో విడుదల చేసింది. పెంగ్విన్ అనే టైటిల్ తో వచ్చిన ఆ సినిమాను విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది అనే చెప్పాలి. యూత్ ఆ సినిమాను చాలా బాగా ఆదరించారు అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే ఆమె మరో సినిమాను కూడా అందులో విడుదల చేయడానికి గానూ ప్లాన్ చేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. 

 

అవును ఆమె మరో సినిమా మిస్ ఇండియా అనే సినిమాను అందులో విడుదల చేయడానికి రెడీ అయింది. ఒక హీరోయిన్ సినిమాను విడుదల చెయ్యాలి అంటే ఆమె స్టార్ ఇమేజ్ ఎక్కడ దెబ్బ తింటుందో ఓటీటీ లో అయితే అని ఆలోచిస్తున్న రోజుల్లో ఆమె మాత్రం ఏ విధంగా కూడా మరో ఆలోచన లేకుండా విడుదల చేయడం ఇప్పుడు నిజంగా ఆదర్శం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: