ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై ఛీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు మాట దాటవేస్తున్నాడంటూ నటి సాయి సుధా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు శ్యామ్ కె నాయుడుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజుకి బెయిల్ మీదుగా బయటకి వచ్చిన శ్యాక్ కె నాయుడు సాయి సుధాతో కాంప్రమైజ్ కావడానికి తనవారిని పంపించాడట.

 


చర్చలు అంత త్వరగా తెగలేదని, వాటికి చాలా సమయం పట్టిందని టాక్. అయితే ఇద్దరి మధ్య చర్చలు ఒక కొలిక్కి రావడానికి ఇండస్ట్రీ నుండి ఒకానొక వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడని అంటున్నారు. అయితే ఇటువైపు పోలీసులు కేసు విచారణలోనే ఉన్నారు. కేసు హియరింగ్ కి వచ్చినపుడు శ్యామ్ కె నాయుడు సాయి సుధాతో కాంప్రమైజ్ అయినట్లు ఒక నోట్ ని తీసుకువచ్చాడట. ఆ నోట్ లో సాయి సుధా సంతకం కూడా ఉందట. 

 

ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. తన సంతకాన్ని శ్యామ్ కె నాయుడు ఫోర్జరీ చేసాడంటూ శ్రీ సుధా కేసు పెట్టింది. తన ప్రమేయం లేకుండానే తన సంతకాన్ని మరొకరితో పెట్టించాడని కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో శ్యామ్ కె నాయుడు మరింత ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. ఇప్పటి వరకూ ఛీటింగ్ కేసు ఒక్కటే అనుకుంటే మళ్లీ ఫోర్జరీ కేసు వచ్చి చేరింది. దీంతో ఈ కేసుని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్ట్ శ్యాక్ కె నాయుడు బెయిల్ ని  క్యాన్సిల్ చేసింది. అంతే కాదు శ్యామ్ కె నాయుడుపై మరో రెండు కేసులని ఫైల్ చేసింది. 

 


మొత్తానికి శ్యాక్ కె నాయుడు మరిన్ని చిక్కుల్లో చిక్కుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని విచారించే పనిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: