దేశంలో కరోనా కారణంగా కొత్త సినిమాలకు బ్రేక్ పడింది. ఎప్పుడు కొత్త సినిమాలతో సందడిగా మారాల్సిన వేసవి కరోనా కారణంగా బోసి పోయిందన్నారు. రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదన్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన చిత్రాలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే తమ సినిమాను విడుదల చేస్తామని కొందరు దర్శక-నిర్మాతలు చెపుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఓటీటీలవైపు చూస్తున్నారన్నారు.
సినిమా కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరుగుతుండటం వలన చిత్ర బృందంపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో ఎప్పటికప్పుడు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతూ మంచి రేటు వస్తే ఇచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘పొన్మగళ్ వందాళ్’ ‘గులాబో సితాబో’, ‘పెంగ్విన్’ చిత్రాలు విడుదలయ్యాయని తెలిపారు. ఇప్పుడు డిస్నీ+హాట్స్టార్లో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడు సినిమాలను విడుదల చేయనున్నారు.
అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బెచారా’ జులై 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో ఆరు చిత్రాలను కూడా డిస్నీ+హాట్స్టార్లో విడుదల చేస్తున్నట్లు సంస్థ వారు తెలిపారు. ‘బాలీవుడ్ కి హోం డెలవరీ’ కార్యక్రమంలో భాగంగా అక్షయ్కుమార్, అజయ్దేవ్గణ్, అభిషేక్ బచ్చన్, ఆలియాభట్, వరుణ్ధావన్లు సామజిక మీడియా వేదికగా మాట్లాడారు.
అయితే అక్షయ్కుమార్ ‘లక్ష్మీ బాంబ్’, అజయ్ దేవ్గణ్ ‘భుజ్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ఆలియాభట్ ‘సడక్2’, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్బుల్’, విద్యుత్ జమ్వాల్ ‘ఖుదాఫీజ్’, కునాల్ ఖేమూ ‘లూట్ కేస్’ చిత్రాలు విడుదలను డిస్నీ+హాట్స్టార్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా సినిమాలు విడుదల కావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీలను పూర్తి వివరాలను డిస్నీ+హాట్స్టార్ ప్రకటించనుందని తెలిపారు.