టాలీవుడ్ లో ఇప్పుడు జనాలు కథల విషయంలో ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ విషయంలో దర్శక నిర్మాతలు కూడా ప్రతీ ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించే అడుగులు వేస్తున్నారు. ఇక దర్శకులు అయితే స్టార్ హీరోలకు కథలు ఇచ్చే విషయంలో ఇప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కథ విషయంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నా సరే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోలే కథలో వేలు పెడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

 

ఇప్పుడు రామ్ చరణ్ కొరటాల శివ తన కోసం రెడీ చేసిన కథను మారుస్తున్నాడు. కమర్షియల్ కోణం తో పాటుగా మంచి నటన ఉండే విధంగా కథను అతను ప్లాన్ చేస్తున్నాడు. సర్కారు వారి పాట కథ ను కూడా మహేష్ బాబు మార్చే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇక మరి కొందరు హీరోలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. సాహో సినిమా తర్వాత కథల విషయంలో ప్రభాస్ భయపడుతున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అతను రాధాకృష్ణ తో చేసే సినిమా విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పడుతున్నాడు అని సమాచారం. 

 

కథను చాలా అందంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని లాక్ డౌన్ లో అదే పనిలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇతర హీరోలు కూడా రచయితలు గా మారిపోయారట. ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఇప్పుడు టాలీవుడ్ జనాలు ఆలోచనలో పడ్డారు. రోజు రోజుకి కూడా ఈ పరిస్థితి పెరుగుతుందని హీరోలు కథల విషయంలో వేలు పెట్టడం తో నిర్మాతలు కాస్త ఇబ్బంది పడే విధంగా వాతావరణం ఉంది అని కొందరు బహిరంగం గానే వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: