టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కొందరు ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అంటూ కాస్త సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు. సినిమాలు లేట్ అయినా సరే పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా కాస్త జాగ్రత్తగా వారి తో సినిమాలు చేసే పరిస్థితి ఉంది అని చెప్పాలి. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే పాన్ ఇండియా సినిమాలు అంటూ సినిమాలను ఆలస్యంగా చేస్తున్నారు. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఏళ్ళకు ఏళ్ళు సమయం తీసుకుంటున్నారు. 

 

ఇక ఇప్పుడు చిన్న హీరోలు కూడా వారి ఆలోచనలోనే నడవడం దర్శక నిర్మాతలకు చికాకుగా మారింది. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు అని సమాచారం. అవును  ఇప్పుడు సినిమా చెయ్యాలి  అంటే కచ్చితంగా వాళ్ళు డెడ్ లైన్  పెడుతున్నారు అని టాక్. రాబోయే రెండు మూడేళ్ళలో సినిమాలను చేసే విషయంలో ఇదే బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారట. ఏమీ లేదు... సినిమాను ఆరు నెలల లోపు పూర్తి చెయ్యాలి అని చిన్న హీరోలకు కండీషన్ పెడుతున్నారు. అలా అయితేనే సినిమాలో నటించాలి అని చెప్పెస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇబ్బంది గా ఉంటే మాత్రం తప్పుకోవచ్చు అని దర్శక నిర్మాతలు హీరోలకు ఏ మాత్రం ఆలోచన లేకుండా చెప్పేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ఇక స్టార్ హీరోల కుమారులు అయినా  మరో  హీరో అయినా సరే ఇదే విధంగా ఆలోచన చేస్తున్నారట. అగ్ర హీరోల సినిమాల విషయంలో కూడా ఇదే విధంగా ఉండాలి అని భావిస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంత వరకు హీరోలు ఓకే చేస్తారు అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: