దక్షిణ భారతదేశ సీనియర్ నటీమణి, రాజకీయ నేత ఆర్ కె రోజా సెల్వమణి అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 1991-2002 సంవత్సరాల మధ్యలో రోజా తన నటనా చాతుర్యంతో హీరోలకు పోటీగా నిలిచి... బడా స్టార్ హీరోలకు సరిసమానంగా క్రేజ్ సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భైరవద్వీపం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతగానో అలరించిన రోజా రాజకీయ రంగ ప్రవేశం చేసి సినిమాలకు దూరమయ్యారు. 


అయితే ఆమె మళ్లీ సినీరంగ ప్రవేశం చేయబోతున్నారని... అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించనున్నారని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. స్మగ్గ్లింగ్  రాకెట్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలోని స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. ఐతే ఇందులోనే ఆర్ కే రోజా పవర్ ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించబోతున్నారట. రోజా గొప్ప నటి అని అందరికీ తెలిసిందే. దీంతో ఆమె ఓ పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ లో అలవోకగా బ్రహ్మాండంగా నటిస్తుందని సినీ ప్రేక్షకులు చెప్పేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 106 వ చిత్రంలో కూడా ఆర్కే.రోజా కనిపిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదని తేలిపోయింది. మరి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు పుష్ప సినిమాలో రోజా నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 


పుష్ప సినిమా తెలుగు, తమిళం,  మలయాళం,  కన్నడ, హిందీ వంటి భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటూ దేశ వ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ అడవుల్లో పుష్ప సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇకపోతే కరోనా ఉదృతి తగ్గుముఖం పడితే ఈ సినిమా చిత్రీకరణ త్వరగా పూర్తి అయ్యి ప్రేక్షకులముందుకు త్వరగా వచ్చేస్తుంది. కానీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుండటంతో సినిమా చిత్రీకరణలు ఎప్పుడు పూర్తవుతాయో... థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతాయో అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: