తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా శ్యామ్ కే నాయుడికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం అందరికి తెలిసిన విదితమే. అయితే గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సినిమాటోగ్రాఫర్ లవ్ ఎఫైర్స్ రూమర్స్ తో అందరికి షాక్ కి గురిచేశాడు.

 

 

అర్జున్ రెడ్డి ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి సుధ అతనిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసు మరొక యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. న్యాయస్థానం శ్యామ్ బెయిల్ క్యాన్సిల్ చేయడంతో ఈ కేసు మళ్ళీ ఉహీంచని మలువు తిరిగిందన్నారు.

 

 


అయితే ఇదివరకే పెళ్లి అయినప్పటికీ గత కొంత కాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు అని అంది.పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సాయి సుధ పోలీసు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా పెళ్లి విషయాన్ని దాటవేసి తనను మోసం చేశాడాని శారీరకంగా వాడుకున్నాడని కూడా ఆమె ఆరోపణలు చేశారు.

 

 

ఆమె పిర్యాదుకు మేరకు పోలీసులు శ్యామ్ కె నాయుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన రెండు రోజుల తరువాత బెయిల్ సంపాదించుకున్న శ్యామ్ మరో తప్పు చేసి కొత్త కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం. తాజాగా అతని బెయిల్ కూడా రద్దయినట్లు సమాచారం.

 

 

శ్యామ్ కె నాయుడు, సాయి సుధ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయినట్లు ఇటీవల ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వచ్చినట్లు సమాచారం. కాంప్రమైజ్ అయినట్లు శ్యామ్ కూడా న్యాయస్థానంలో మరో పిటీషియన్ వేయగా మళ్ళీ సాయి సుధ అతనికి షాక్ ఇచ్చిందని చిత్ర వర్గ సభ్యులు చెప్పుకుంటున్నారు.

 

 

తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆమె కోర్టుకు మరో వివరణ ఇవ్వడంటజో శ్యామ్ కె నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసు నమోదు చేయడమే కాకుండా అతని బెయిల్ ని కూడా రద్దు చేసిందని చిత్ర వర్గ సభ్యులు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: