మహేష్ బాబు సినిమా అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్. ముఖ్యంగా అతని సినిమాల కోసం అమ్మాయిలూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ళు దాటినా సరే యువకుడిగా కనపడుతూ ఇప్పటికి ప్రిన్స్ గానే ఉన్నాడు మహేష్. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు అతను ఒక సినిమా చేస్తున్నాడు. గీతా గోవిందం సినిమాతో స్టార్ దర్శకుడు అయిన పరుశురాం తో అతను ఒక సినిమాను ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సిఎం కొడుకుగా నటిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా కూడా మహేష్ బాబు వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘సర్కారు వారి పాట’ కోసం ఓ భారీ బ్యాంకు సెట్ను వేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాఉ మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై తీసుకొస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన వెంటనే అదే సెట్ లో షూటింగ్ అని టాక్.
ఇక మహేష్ బాబు కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం బరువు పెరుగుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను ఎలా అయినా సరే వచ్చే ఏడాది చివర్లో తీసుకుని రావాలి అని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నమ్రత కూడా ఉండే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కుమార్తె సితారా కూడా ఉంటుంది అని టాక్. చూడాలి మరి ఏమవుతుందో...