తెలుగు సినిమా రంగంలో ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. 'బాహుబలి' తరహాలో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోసారి ప్రభాస్ - రానా మళ్లీ కలిసి నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'బాహుబలి' సినిమాలో మాహిష్మతి సింహాసనం కోసం నువ్వా నేనా అన్నట్టు గా తలపడిన ఇద్దరు హీరోలు మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రజెంట్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో రానా ఓ ప్రత్యేకమైన పాత్రలో రెండు నిమిషాల పాటు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

రానా క్యారెక్టర్ అదిరిపోతుందని మొదటిలో ఆ క్యారెక్టర్ కోసం గోపీచంద్ ని సంప్రదించగా కొన్ని కారణాలవల్ల గోపీచంద్ మిస్ అయ్యారట. కానీ రానాకి అవకాశం లభించడంతో గోపీచంద్ ప్రభాస్ సినిమా రానా ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్లో కనిపించనట్లు టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో గోపీచంద్ ప్రభాస్ స్నేహం గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ప్రభాస్ ఆలోచన ప్రకారం ఈ క్యారెక్టర్ కి రానా అయితేనే కరెక్ట్ అని డైరెక్టర్ కి చెప్పడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేసి రానాకి అదిరిపోయే క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్.

 

మరి వస్తున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాకి 'రాదే శ్యామ్' అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే సినిమా యూనిటీ అధికారికంగా ప్రకటించనున్నారు అని సమాచారం. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ రాబోయే జూలై మాసం సెకండ్ వీక్ నుండి రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకోనున్నట్లు వార్తలు అందుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: