మన తెలుగు లో ఇప్పుడు చాలా వరకు స్టార్ హీరోయిన్ లు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. పూజ హెగ్డే, రష్మిక సహా మరి కొందరు హీరోయిన్ లు బాలీవుడ్ నుంచి కూడా వచ్చి సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారు అందరూ కూడా దర్శక నిర్మాతలకు పెద్ద తల నొప్పిగా మారిపోయారు అనే వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. అవును హీరోయిన్ లు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారిపోయారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. నిజం ఎంత అనేది తెలియదు గాని చాలా మంది హీరోయిన్ లు సినిమాల షూటింగ్ కి వచ్చే పరిస్థితులు అసలు కనపడటం లేదు. 

 

అలియా భట్ ముంబై లో ఉండటం తో రాజమౌళి బాగా ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం. అదే విధంగా ఒలివియా మోరిస్ అమెరికాలో ఉండటం కూడా జక్కన్నకు పెద్ద సమస్య అయిపోయింది అనే చెప్పాలి. ఇక మరి కొంత మంది హీరోయిన్ ల పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది అని చెప్పాలి. పూజ హెగ్డే ముంబై లో ఉంది అని ప్రభాస్ సినిమాకు బాగా ఇబ్బంది అవుతుంది అని టాలీవుడ్ లో టాక్ మరి. అదే విధంగా మరి కొందరు కూడా ఇలా విదేశాల్లో ఉండిపోయారు అని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా పెద్ద సమస్యగా మారిపోయారట. 

 

మరి వారిని ఎప్పుడు ఇక్కడికి తీసుకిని వచ్చి షూటింగ్ లు చేస్తారు అనేది చూడాలి. రాబోయే రెండు మూడు వారాలు వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి వారిని క్వారంటైన్ లో ఉంచి సినిమాలు ప్లాన్ చెయ్యాలి అని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి. అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాకు దాదాపుగా దూరం అనే అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: