ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా రెండేళ్ళ పాటు సినిమాలకు దాదాపుగా దూరంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. సినిమాలను విడుదల చేసి ఇక సినిమాలకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండటమే మంచిది అనే ఆలోచనలో దాదాపుగా స్టార్ హీరోలు ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. నిర్మాతలు కూడా ఇప్పుడు సినిమాలు చేసే విషయంలో కాస్త ఆలోచనలో పడటం తో చాలా వరకు స్టార్ హీరోలు చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి మాత్రం సినిమాల విషయంలో ఏ విధంగా కూడా వెనక్కు తగ్గడం లేదు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

అవును ఆయన లూసిఫర్ సహా మరో రెండు మూడు సినిమాలను వచ్చే రెండేళ్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 నాటికి తన నుంచి మూడు సినిమాలను విడుదల చెయ్యాలి అని భావిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ మరి. ఆయన చాలా వరకు ఇప్పుడు సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే చేస్తున్నారు. దూకుడుగా చేసే పరిస్థితి అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి. మరి ఎప్పుడు ఆయన ఆ సినిమాలను లైన్ లోకి తీసుకొస్తారు అనేది చూడాలి. ఇప్పుడు కొరటాల శివ తో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నారు. 

 

సినిమా కోసం ఆయన దాదాపు రెండేళ్ళ నుంచి కష్టపడుతున్నారు. సైరా సినిమా షూటింగ్ అయిన వెంటనే ఆయన ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టారు అని  తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన దాదాపుగా కూడా సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకునే చేస్తున్నారు. కరోనా ఉన్న నేపధ్యంలో ఆయన షూటింగ్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆయన షూటింగ్ వద్దు అని భావిస్తున్నట్టు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: