క్లాస్ చిత్రాలతో ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల అంటే ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. ఆయన ఏ సినిమా తీసిన ఎంతో సహజంగా తెరకెక్కిస్తాడు. ఆ మధ్య ఈయన డైరెక్షన్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లో  ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ యాసలో సాయిపల్లవి మాట్లాడిన విధానానికి నిజంగా అందరు ఫిదా అయ్యారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఎంసిఎ, పడి పడి లేచె మనసు సినిమాలు అంతగా సక్సస్ కాకపోవడంతో కాస్త వెనకబడింది. 

 

కాని సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి మాత్రం ఢోకా లేదనిపించింది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా చేస్తుంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పక్కా ఫిదా ని మించి సక్సస్ సాధిస్తుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ‘విరాట పర్వం’ సినిమాలోను నటిస్తోంది. రానా దగ్గుబాటి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమ కథగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో సాయిపల్లవి ఒక పేద జానపద కళాకారిణిగా కనిపించనుందట. 

 

ఇక సాయి పల్లవి రీసెంట్ గా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదు.. మేకప్ వేసుకోవడం వల్ల నా అందం మొత్తం పోతుంది..మేకప్ లేకుండానే బాగుంటానని వెల్లడించింది. ఇక సాయి పల్లవిని మలయాళీ అని పిలిచినా నచ్చదట. అలా ఎవరైనా పిలిస్తే కోపం వస్తుందట. నేను తమిళమ్మాయిని... కోయంబత్తూర్ లోనే పెరిగాను...అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన కార్పొరేట్ యాడ్స్ గాని స్కిన్ షో చేయడానికి గాని సాయి పల్లవి సిద్దంగా లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: