సినీ పరిశ్రమలో కొంత మంది స్టార్లకు భలే కలిసి వస్తుంది. అయితే కొంత మంది స్టార్లకు మాత్రం దీర్ఘకాలంగా నటించినా సరైన గుర్తింపు రాదు. ఈ మద్య కొంత మంది హీరో, హీరోయిన్లకు ఒరటీ రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకు తిరుగులేని పేరు వచ్చింది. ఛలో సినిమాతో రష్మిక మందన పంట పండింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ మూవీలో నటించిన సాయి పల్లవికి మంచి క్రేజ్ వచ్చింది. వాస్తవానికి ఈ అమ్మడు మాలీవుడ్ మూవీ ప్రేమమ్ సినిమాలో నటించింది.  అప్పటి నుంచి సాయి పల్లవిని మాలీవుడ్ బ్యూటీ అంటూ వస్తున్నారు.

 

 మాలీవుడ్ లో నటించినా.. ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళం భాష‌ల‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవి మొదటి సినిమా మాలీవుడ్ లో నటించడంతో తనని మాలీవుడ్ బ్యూటీ అంటున్నారని.. తాను మాలీవుడ్ నటిని కాదు బాబో అంటూ ప‌లుసార్లు క్లారిటీ ఇచ్చింది.  అలా పిలవడంతో ఈ చెన్నై బ్యూటీకి కోపం వచ్చి 'నేను మలయాళీని కాదు. తమిళమ్మాయిని. కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను ఇంకెప్పుడు మలయాళీ అని మాత్రం పిలవకండి' అంటూ  సమాధానం ఇచ్చిందట ఈ నేచురల్ బ్యూటీ. స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. 

 

 ఫిదా, పడిపడి లేచే మనసు సినిమాలలో మేకప్ లేకుండా నటించి.. అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి  తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదని చెబుతుంది.  మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందని.. మేకప్ లేకుంటేనే బాగుంటానని అంటుంది. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. హీరో రానా సరసన నటిస్తున్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: