పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రణం,రౌద్రం ,రుధిరం(ఆర్ఆర్ఆర్) షూటింగ్ నల్గొండలోని ఫోర్ట్  ఏరియాలో జరుగనుందని సమాచారం. ఓకోటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ,అజయ్ దేవగణ్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. నిజానికి ఈషెడ్యూల్ సమ్మర్ లోనే పూణే లో జరగాల్సివుంది కానీ కరోనా వల్ల వాయిదాపడింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పూణే లో షూటింగ్  చేయడం కష్టం కాబట్టి నల్గొండలో ఆషెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదలచేయాలనుకున్నారు కానీ  కరోనా వల్ల షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుండడంతో సమ్మర్ లో విడుదలకానుంది.
 
టాప్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం ,అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్  కొమురం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు గా కనిపించనున్నాడు. ఇటీవల ఈసినిమా నుండి రామ్ చరణ్ పాత్ర తాలూకు టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 
 
ఈచిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ అలాగే ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించనున్నారు అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరు  హీరోయిన్లు సెట్ లో అడుగుపెట్టలేదు. వీరితోపాటు శ్రీయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె ఈచిత్రంలో అజయ్ దేవగణ్ భార్య గా నటించనుందని టాక్. 400కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్ర  డైలాగ్స్ అందిస్తున్నాడు. తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: