యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి ట్రోల్ అవుతున్నాడు. తరుణ్ ఆ మధ్య తన మాటలతో ఎన్టీఆర్ ను.. రీసెంట్ గా తన రాతలతో మహేశ్ ను టార్గెట్ చేశాడు. ఇన్ స్టా స్టోరీలో తరుణ్ రాతలు తమ హీరోను ఉద్దేశించి రాసినవేనన్న అభిప్రాయంతో మహేశ్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ ను ఏకేస్తున్నారు. 

 

పెళ్లి చూపులతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ మలయాళ చిత్రం కప్పెల చూసి ఇన్ స్టా వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. హీరో పిచ్చోడిలా గట్టిగా అరవడు. స్లో ఎమోషన్ లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు ఉండవు. ప్రతి రెండు నిమిషాలకూ హీరో ఎంట్రీ ఉండదు. ఈ మాటలు చాలా మంది స్టార్స్ కు తగిలినా.. పర్టిక్యులర్ గా ఎవరినీ ఉద్దేశించినవి కాకపోవడంతో లైట్ గా తీసుకున్నారు. అయితే.. మీకు మాత్రమే చెప్తాలో సినిమా ఆద్యంతం తరుణ్ కనిపించలేదా.. అని సెటైర్స్ పడ్డాయి. 

 

చివరి పదినిమిషాల్లో  రైతుల గురించో.. సైనికుల గురించో.. దేశం గురించో మెసేజ్ ఉండవన్న తరుణ్ మాటలు డైరెక్ట్ గా మహేశ్ ఫ్యాన్స్ కు తగిలాయి. మహర్షి సినిమా రైతుల చుట్టూ తిరుగుతుంది. సైనికులు.. దేశం నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు నడిచింది. దీంతో కనెక్ట్ అయిన మహేశ్ ఫ్యాన్స్ తరుణ్ కు ఘాటుగా బదులిచ్చారు. ఒన్ మూవీ హిట్ డైరెక్టర్ కూడా చెప్పేవాడే.. ముందు డైరెక్షన్ ఎలా చేయాలో నేర్చుకో.. హిట్ కొట్టి మాట్లాడు అంటూ.. ట్రోలింగ్ చేశారు మహేశ్ ఫ్యాన్స్. 

 


తెలుగు సోషల్ మీడియాలో తరుణ్ వర్సెస్ మహేశ్ ఫ్యాన్స్ గా మారింది. తరుణ్ మీకు మాత్రమే చెప్తా టీవీ ప్రోగ్రాంకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. తొలి ఎపిసోడ్ కు సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా విచ్చేశాడు. ఏం తీశావ్ అన్నా.. అంటూ సినిమాను మెచ్చేసుకొని.. ఈ రోజు మలయాళ మూవీని పొగడటం కోసం.. సరిలేరు నీకెవ్వరులోని దేశభక్తిని.. సైనికులను తక్కువ చేసి మాట్లాడాడంటూ. తరుణ్ పై మండిపడుతున్నారు. ఇలాంటి ట్రోలింగ్స్ ను కేర్ చేయనని కౌంటర్ ఇచ్చాడు తరుణ్. ఐడెంటిటీ లేకుండా.. ఫేక్ ఐడీలతో ట్రోల్ చేసే వారిని పట్టించుకోనంటున్నాడు. ఈ గొడవ చివరకు ఎక్కడకు వెళ్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: