మన టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే స్టార్  హీరోల సినిమాలు అనగానే ఒకటికి పది సార్లు ఆలోచించుకుని సినిమాలు చేసే వాతావరణం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు అందరూ కూడా చాలా వరకు కూడా జాగ్రత్తగానే ఉంటున్నారు అనే విషయం చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే  ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు హీరోల విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు ఏ విధంగా కూడా భయపడటం లేదు అని అంటున్నారు. అవును కొందరు హీరోల విషయంలో ఏ మాత్రం కూడా ఆందోళన అనేది నిర్మాతలకు లేదట. 

 

వారిలో మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ ఈ నలుగురి తో సినిమాలు చేసే విషయంలో దర్శక నిర్మాతలు అసలు ఏ మాత్రం కూడా భయపడటం లేదు అని అంటున్నారు. పెట్టుబడి ఇప్పుడు కాకపోయినా కాస్త లేట్ అయినా సరే సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ నుంచి అయినా సాధించవచ్చు అని భావిస్తున్నారట. ఇక టికెట్ పెట్టి ఓటీటీ లో సినిమా విడుదల చేసినా సరే పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు అని వాళ్ళు భావిస్తున్నారట. మహేష్ బాబు సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు ఏ విధంగా ఉన్నా సరే జనాలు కచ్చితంగా చూసే పరిస్థితి ఉంటుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అందుకే వాళ్ళ సినిమాలను ఇప్పుడు ప్రత్యేకంగా దర్శక నిర్మాతలు చూస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇప్పుడు ఎన్టీఆర్ మహేష్ బాబు ఇద్దరూ కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళు ఇద్దరూ కూడా రెండు సినిమాలను లైన్ లో పెట్టేసారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: