టాలీవుడ్ జనాలకు ఇప్పుడు వినోదం అనేది చాలా తక్కువ అయింది. వారానికి ఒక సినిమా అయినా సరే చూసే జనాలు ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేక నానా బాధలు పడుతున్నారు అనేది వాస్తవం. సినిమాలు చూడటానికి మోక్షం లేదు. ఇక స్టార్ హీరోలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈ కరోనా అయితే గాని సినిమాలకు కాస్త జీవం వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలతో బిజీ అవుతున్నారు గాని చేసిన సినిమాలు విడుదల అయ్యే వాతావరణం మాత్రం దాదాపుగా లేదు అనే చెప్పాలి. 

 

స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు సెట్స్ మీదనే ఉన్నాయి. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలను సెట్స్ మీదనే ఉంచారు. ఇక కరోనా అయిన తర్వాత అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షార్ట్ ఫిలిమ్స్ ని ఇంట్లో ఉండి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ లో టాక్ మరి. మహేష్ బాబు పిల్లలు భార్య తో కలిసి ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు. 

 

అదే విధంగా ఎన్టీఆర్ కూడా అలాంటి ఆలోచన ఒకటి చేస్తున్నాడు అని టాలీవుడ్ లో అంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే అతను గోబర్ గ్యాస్ కి సంబంధించి తన భార్య తో కలిసి ఒక సినిమాను చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. మరి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: