యూఎస్ లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ సినిమా బిజినెస్ తెలుసుకుని నిర్మాణ రంగంలోకి దిగారు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు సినిమాతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ. కొరటాల శివ చెప్పిన కథని నమ్మి అడిగినంత బడ్జెట్ ఇచ్చి సినిమా మీద తమకున్న ప్యాషన్ చూపించారు. అదే కొరటాల శివతో ఎన్.టి.ఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమా నిర్మించారు. ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 

 

కొరటాల శివతో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కాంబో షురూ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో ఎవరన్నది తెలియదు కాని కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ సినిమా త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందట. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మైత్రి మేకర్స్ మూవీ ఉంటుదని తెలుస్తుంది. 

 

ఇక కొరటాల శివ నెక్స్ట్ బన్నితో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ సినిమా ఇదే కావొచ్చని అంటున్నారు. అయితే రంగస్థలం తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరి కొరటాల శివ సినిమా అల్లు అర్జున్ తోనే అయితే బన్నితో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మైత్రి మేకర్స్ పెద్ద స్కెచ్ వేశారని చెప్పొచ్చు. ఆచర్య తర్వాత కొరటాల శివ చేసే సినిమా ఏది..? అందులో హీరో ఎవరు అన్న విషయాల మీద మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది.                             

మరింత సమాచారం తెలుసుకోండి: