ఈ ఏడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మహేష్ బాబు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా చాలా వెరైటీగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సినిమా రొమాంటిక్ తరహాలో మాస్ నేపద్యంలో పరశురాం సినిమా తీయబోతున్నట్లు మహేష్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఏ మాదిరిగా ఉందో అదే తరహాలో ఒకపక్క రొమాన్స్ చేస్తూ మరోపక్క రౌడీలతో అదరగొట్టే గేమ్ ఆడుకునే విధంగా మహేష్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.

 

సినిమాలో బ్యాంకు మేనేజర్ గా మహేష్ కనిపించనున్నాడని టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఈ సందర్భంగా రామోజీ ఫిలిం సిటీలో మహేష్ సినిమా కోసం బ్యాంక్ సెట్ భారీ స్థాయిలో వెయ్యాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ బ్యాంకు సెట్ లోనే  సినిమా షూటింగ్ సగానికిపైగా జరుగుతుందని, దీంతో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ స్థాయిలో మహేష్ సినిమా కోసం కొన్ని కోట్ల తో ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా ఖర్చు చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇలాంటి సమయంలో అంత ఖర్చు ఏంటి అని కొంతమంది ఇండస్ట్రీ లో ఉన్నవారు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై కామెంట్లు చేస్తున్నారు.  మరోపక్క అభిమానులు మహేష్ బాబు సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టినా లాభాలు భారీ స్థాయిలో వస్తాయి ఇది పెద్ద ఖర్చు ఏమి కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమా థియేటర్స్ పరిస్థితే చాల డేంజర్ జోన్ లో ఉంది. ఇలాంటి సమయంలో నిర్మాతలు హీరో ల క్రేజ్ బట్టి కాకుండా పరిస్థితులు బట్టి బడ్జెట్ సెట్ చేసుకుంటే బెటర్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: