ప్రస్తుతం బాలీవుడ్ ను ఊపేస్తున్న క్రేజీ హీరోయిన్ కియరా అద్వాని. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో జతకట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. కియరా అద్వాని అనగానే అందరికి గ్రుతొచ్చేది ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఈ సినిమాలో ధోని భార్య ప్రియాంక పాత్రలో కియరా అలరించింది. అయితే కియరా మొదటి సినిమా ఎమ్మెస్ ధోని కాదు ఫగ్లీ. 

 

కబీర్ సదానంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అశ్విన్ యాద్రితో పాటుగా అక్షయ్ కుమార్ కూడా నిర్మిణ భాగస్వామ్యం అయ్యారు. ఈ సినిమా ఆడిషన్స్ కు క్యాజువల్ గా వెళ్లిన కియరా తను ఆ సినిమాలో సెలెక్ట్ అవుతానని అసలు అనుకోలేదట. కాని సడెన్ గా చిత్రయూనిట్ నుండి కాల్ వచ్చిందట. ఇక మొదటిసారి కెమెరా ఎక్స్ పీరియన్స్ కూడా చాలా విచిత్రంగా జరిగిందని అంటుంది కియరా. షూటింగ్ స్పాట్ కు వెళ్లడం.. హెయిర్ డిజైనర్ తనని రెడీ చేయడం.. మేకప్ మెన్ మేకప్ చేస్తుండటం ఇవన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అని చెప్పుకొచ్చారు కియరా అద్వాని. ఆ టైంలో యాంక్సైటీ, ఎక్సైట్మెంట్ అన్ని కలిగాయని.. ఆ సినిమాలో నటించడం ఓ మంచి ఎక్స్ పీరియన్స్ అంటుంది కియరా.

 

ఓ పక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సీరీస్ లలో కూడా తన హవా కొనసాగిస్తుంది కియరా అద్వాని. అక్కడ సూపర్ బిజీగా ఉంది కాబట్టే తెలుగులో క్రేజీ ఛాన్సులు వచ్చినా సరే చేయనని చెబుతుందట.                            

మరింత సమాచారం తెలుసుకోండి: