"లౌక్యం" సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సక్సస్ ని అందుకోలేకపోయాడు యాక్షన్ హీరో గోపిచంద్. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పంతం’ సినిమా కూడా దారుణంగా ఫ్లాపయింది. అంతేకాదు గతేడాది తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా అడ్రస్ లేకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డికి పోటీగా బరిలో దింపాడు. ఏ నమ్మకంతో దింపాడో గాని సైరా సినిమాతో పోటీపడలేక ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. 

 

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో "సీటీమార్" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గోపీచంద్, తమన్నా ల ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి కాస్త బజ్ క్రియోటయింది. హిట్ అన్న నమ్మకం కలిగింది. 

 

ఇక ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దిగాంగన నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాను ఆగష్టులో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే సంపత్ నంది దర్శకత్వంలో చేసిన  గత చిత్రం ‘గౌతమ్ నందా’ బాక్సాఫీస్ చతికిల పడింది. ఈ రకంగా అటు గోపీచంద్ కి ఇటు సంపత్ నందికి ఫ్లాప్ సినిమాల ట్రాక్ రికార్డ్ ఉంది. కాని తమన్నా మాత్రం సక్సస్ ట్రాక్ లో ఉంది. తన ఇమేజ్ తోనే ఇప్పుడు ఈ ఇద్దరికి సక్సస్ రావాలని చూస్తున్నారట. ఇక తమన్నా త్వరలో అల్లు అరవింద్ ఆహా లో ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: