ఇటీవల విడుదలైన పలాస సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన చాలా మంది పెద్ద పెద్ద నిర్మాతలు డైరెక్టర్లు సినిమా యూనిట్ ని ఎంతగానో అభినందించారు. ఈ సినిమాలో సింగర్ రఘు చక్కటి షావుకారి పాత్రలో నటించిన నటన సినిమాకి హైలెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి రఘు కుంచే సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా సింగర్ గా మంచి పేరు ఉంది. అడపాదడపా అప్పుడప్పుడు అప్పట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన పూర్తిస్థాయి క్యారెక్టర్లో రఘు ఎప్పుడూ నటించలేదు.
అలాంటిది 'పలాస' సినిమాలో రఘు నటించిన క్యారెక్టర్ కి పెర్ఫార్మెన్స్ కి మంచి పేరు రావడంతో… రఘు ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుకున్నారు. పూర్తి విషయంలోకి వెళితే ఓటిటి లో నెట్ఫ్లిక్స్ రూపొందించే ఓ వెబ్ సిరీస్ లో కీలక క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే కాకుండా ఓ భారీ బయోపిక్ సినిమాలో రఘు మంచి పాత్ర పోషించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు నిర్మాతగా కూడా రఘు కొన్ని సినిమాలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జీ 5లో విడుదలైన `47 డేస్`కి తనే నిర్మాత. సత్యదేవ్ కథానాయకుడిగా నటించాడు. సత్యదేవ్తోనే మరొకసారి రఘు సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ రఘు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి మంచి స్నేహితుడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుండి ఇద్దరూ అనేక కష్టాలు పడి ఓ స్థాయిలో రావడం జరిగింది.