ప్రస్థుతం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో కేవలం ఇంటికే పరిమితం అయిన మహేష్ తన భార్య పిల్లలతో పూర్తి సమయాన్ని గడుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. కరోనా భయంతో మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ డిసెంబర్ వరకు వాయిదా పడిన పరిస్థితులలో మహేష్ తన పిల్లలతో పూర్తి సమయం గపడమే ఒక పనిగా పెట్టుకున్నాడు.


ఈ పరిస్థితుల మధ్య మహేష్ భార్య నమ్రత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. తనకు మహేష్ తప్ప ఇండస్ట్రీలో మరే హీరో నచ్చడని చాల ధైర్యంగా చెప్పింది. మంచిగా తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమయానికి నిద్రపోవడం మించిన హెల్త్ జాగ్రత్తలు మారేవి లేవు అంటూ ఈ కరోనా సమయంలో అందర్నీ జాగ్రత్తగా ఉండమని చెప్పింది నమ్రత.


ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ తన మామగారు ‘కూలెస్ట్ మామయ్యా’ అని చెపుతూ తనకు కృష్ణ తన తండ్రికన్నా ఎక్కువ అని చెపుతోంది. ఇదే సందర్భంలో మహేష్ సినిమాల ఎంపిక వెనుక తన ప్రమేయం ఉంటుంది అన్న వార్తల పై స్పందిస్తూ మహేష్ ఎవరి మాట వినేరకం కాదని బయటకు కనిపించేంత కూల్ గా ఇంటిలో ఉండడు అంటూ మహేష్ నిర్ణయాల పై తన ప్రభావం లేదు అన్న విషయాల పై క్లారిటీ ఇచ్చింది.


తన పిల్లలు గౌతమ్ సితార ల గురించి మాట్లాడుతూ తన పిల్లలకు ఇంగ్లీష్ మరాఠి భాషలతో పాటు తెలుగు కూడ పూర్తిగా వచ్చేలా తాను ప్రయత్నిస్తున్న విషయాలు వివరిస్తూ ప్రస్తుతం గడుస్తున్న లాక్ డౌన్ సమయంలో ఏరోజు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదు అని కామెంట్స్ చేసింది. ఈ లాక్ డౌన్ సమయంలోనే మహేష్ తన కూతురు సితార ను ‘పర్పి’ అనే ముద్దు పేరుతో పిలుస్తున్నాడని అయితే ఆ ముద్దు పేరు అర్థం ఏమిటో తనకు కూడ తెలియదు అంటూ నమ్రత జోక్ చేస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: