సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. క్రితిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ రెండు పాటలు విడుదల అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటలకి విశేష స్పందన లభించింది.

IHG

నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అంటూ వచ్చిన రెండు పాటలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ధక్ ధక్ ధక్ అంటూ సాగే పాటలో విజువల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ స్క్రీన్ ప్రెసెన్స్, క్రితిశెట్టి పర్ ఫార్మెన్స్ సహజంగా అనిపించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అదీగాక ఈ మధ్యనే సుకుమార్ ఉప్పెన చిత్రాన్ని చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యాడట.

IHG

దాంతో దర్శకుడు బుచ్చిబాబు సానాకి మంచి నమ్మకం వచ్చిందట. అయితే ఇప్పుడు బుచ్చిబాబు సానాకి మంచి అవకాశం వచ్చిందని అంటున్నారు. సుకుమార్ రికమెండేషన్ తో బుచ్చిబాబు చరణ్ కి కథ చెప్పాడట. ఉప్పెన సినిమాని చూసిన చరణ్ బుచ్చిబాబు పనితనం నచ్చి, అతను చెప్పిన కథ నచ్చడంతో ఓకే అన్నాడని టాక్ వినబడుతుంది. భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అంటున్నారు.

 

 

మొదటి సినిమాతో మెగా మేనల్లుడిని పరిచయం చేస్తున్న బుచ్చిబాబుకి చరణ్ తో సినిమా అంటే మంచి అవకాశమే వచ్చిందని చెప్పాలి. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: